Friday, April 26, 2024

హిందూ ఆలయం ధ్వంసం కేసులో 350 మందిపై కేసులు ఎత్తివేత

పాకిస్థాన్‌లోని ఖ‌బ‌ర్ ఫ‌క్తున్సాలో ఉన్న వందేళ్ల క్రితం నాటి హిందూ ఆల‌యాన్ని గ‌త ఏడాది కొంద‌రు ముస్లింలు ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 350 మందిపై కేసుల‌ను ఎత్తివేయ‌నున్న‌ట్లు మంగ‌ళ‌వారం పాకిస్థాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఆల‌యాన్ని ధ్వంసం చేసిన వారిని హిందూ వ‌ర్గం క్ష‌మించిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.

కాగా మార్చి 2021లో హిందూ, ముస్లిం మ‌త‌పెద్ద‌ల మ‌ధ్య జిర్గా స‌మావేశం జ‌రిగిన‌ట్లు పాకిస్థాన్ హోంశాఖ తెలిపింది. అయితే హిందూ ఆలయం ధ్వంసం కేసుకు సంబంధించి నిందితులంద‌రినీ విడుదల చేయాలంటూ రెండు వ‌ర్గాలు ఈ స‌మావేశంలో అంగీక‌రించాయ‌ని, కోర్టుకు కూడా వాళ్లు లేఖ పంపిన‌ట్లు హోంశాఖ వెల్లడించింది.

ఈ వార్త కూడా చదవండి: మొదటి స్థానంలో హిమాచల్ ప్రదేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement