Wednesday, April 24, 2024

వైసీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో ఆక్రమణల తొలగింపుతో నష్టపోయిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన కోర్టు ముందస్తు నోటీసులు లేకుండా అర్దాంతరంగా కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బొల్లాతో పాటు మున్సిపల్ కమిషనర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వచ్చంధ సంస్థకు విదేశాల నుండి నిధులు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆంజనేయులుకు చెందిన స్వచ్ఛంధ సంస్థకే ఎన్నారైల నుండి నిధులు వస్తున్నాయని బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు కోటప్పకొండ సాక్షిగా ప్రమాణం చేయాలంటూ టీడీపీ, వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగారు.

ఇది కూడా చదవండి: జగన్ బెయిల్ రద్దు కేసు.. సీబీఐకి ఆఖరి అవకాశం

Advertisement

తాజా వార్తలు

Advertisement