Wednesday, May 8, 2024

పద్మశ్రీ విజయ సారథి ఇక లేరు

కరీంనగర్ ముద్దు బిడ్డ శ్రీభాష్యం విజయసారథి (87) ఇక లేరు. అలకపురి లోని నివాసంలో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాశ విడిచారు. సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసిి వ్యాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరుంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020 సంవత్సరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.

పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సంస్కృత పండితులు భాష్యం విజయ సారథి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సంస్కృత భాష విస్తృతంగా ప్రజలు తీసుకొని వెళ్లి సంస్కృత భాష అభివృద్ధి కోసం విజయ సారథి ఎనలేని కృషి చేశారు అని గుర్తు చేశారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వివిధ విద్యా సంస్థల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన మహా వ్యక్తి విజయ సారథి అన్నారు. కరీంనగర్ లోని యజ్ఞ వరహా స్వామి ఆలయ ట్రస్టీగా విశేష కృషి జరిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడ‌రు. భాష్యం విజయసారథి మృతి రాష్ట్రానికి తీరని లోటు అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను మనోధర్యంతో ఉండాలని కోరుకుంటున్నా అని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement