Wednesday, May 8, 2024

దేశంలో మొదటిసారి 4లక్షలకు పైగా కరోనా కేసులు…రికార్డ్ బ్రేక్

దేశంలో కరోనా కేసులు అస్సలు తగ్గటం లేదు. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో మొదటి సారి రికార్డ్ స్థాయిలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 4,12,262 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. మరోవైపు కరోనా కారణంగా 3,980మంది మృతి చెందారు.కరోనా తో ఒక్క‌రోజే ఇంత మంది దేశంలో మరణించటం ఇదే మొదటిసారి. ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,77,410కి చేరగా… 1,72,80,844 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అలాగే 23,01,68 మంది ఇప్పటివరకు కరోనా తో మృతి చెందారు. మరోవైపు 35,66,398 యాక్టీవ్ కేసులు ఇండియాలో ఉన్నాయి. కొత్త‌గా వ‌చ్చిన కేసుల్లో అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 57,640, క‌ర్ణాట‌క 50,112, కేర‌ళ 41,953, త‌మిళ‌నాడు 23,310, ఏపీ 22వేల‌కు పైగా న‌మోద‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement