Sunday, May 5, 2024

ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న – 777చార్లీ

తెలుగు ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచిత‌మే క‌న్నడ హీరో ర‌క్షిత్ శెట్టి. ఇటీవలే వచ్చిన ‘777చార్లీ’తో ఇక్కడ వారికి మరింత దగ్గరయ్యాడు. ఎలాంటి అంచనాల్లేకుండా జూన్‌ 10న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘కేజీఎఫ్‌’ తర్వాత ఆ స్థాయిలో ఈ చిత్రానికి గుర్తింపు వచ్చింది. కిర‌ణ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంతో బాబీ సింహా, సంగీత శృంగేరీ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అడ్వేంచర్‌ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పరంవహ్‌ స్టూడీయోస్‌ బ్యానర్‌పై రక్షిత్‌ శెట్టి స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్షన్స్‌ బ్యానర్‌పై సురేష్‌బాబు విడుదల చేశాడు.

తెలుగులో ఈ చిత్రానికి రూ.4 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. సుమారు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనల్‌ రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. 777 చార్లీ’ సినిమాను సెప్టెంబర్‌ ౩౦నుండి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే ఈ చిత్రాన్ని ‘పే పర్‌ వ్యూ’ పద్దతిలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఈ చిత్రాన్ని చూడాలంటే రెంట్ పే చేయాల్సి ఉంటుంది. కాగా ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ఇప్పటికే ‘వూట్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement