Monday, April 29, 2024

Oscar 2024 – అస్కార్ బ‌రిలో మ‌ల‌యాళం బ్లాక్ బ‌స్టర్ 2018

‘ఆస్కార్‌ 2024’ అవార్డుల కోసం భారత్‌ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018స‌ అధికారికంగా ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది.

‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషల సినీ ప్రేక్షకులతోనూ కన్నీళ్లు పెట్టించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సినిమాలను వీక్షించింది. మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించి, చివరకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం ‘2018’ సినిమాను కమిటీ ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement