Tuesday, April 30, 2024

రూ.100 తీసిన ప్రాణం

మాములుగా గొడవలు జరగడం సహజం. ఆ గొడవలు కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తాయి. తాజాగా విజయవాడలో వంద రూపాయల కోసం నలుగురి మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణం బలిగొంది. విజయవాడ బాంబే కాలనీకి చెందిన నలుగురు సెంట్రింగ్ కార్మికులకు గన్నవరం లో పని దొరికింది. అందుకు గాను రెండు వేల రూపాయలు కూలీ డబ్బులు వచ్చాయి.

ఆ డబ్బులు ముగ్గురు 500 రూపాయల చొప్పున పంచుకొని మిగిలిన నాలుగు వ్యక్తి బొడ్డుపల్లి నాగరాజుకి 400 ఇచ్చారు. దీంతో గొడవ మొదలైంది. ఆ తరువాత కూడా అదే గొడవ పడుతూనే ఉన్నారు. ఈ గొడవలో నాగరాజు మరణించాడు. మిగిలిన ముగ్గురు తీవ్రగాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement