Thursday, May 2, 2024

కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తిని కాటికి పంపిన ఆస్పత్రి

హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి మంచిగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు.. ఇంజక్షన్ ఇచ్చిన గంటలోపే సదరు వ్యక్తి చనిపోయిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే… మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి కడుపునొప్పితో యశోదా ఆస్పత్రికి వచ్చాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేసి అతడికి ఇంజక్షన్ ఇచ్చారు. కానీ గంటలోపే ఆ వ్యక్తి కదల్లేని పరిస్థితి నెలకొంది. అనంతరం అతడు నొప్పితోనే చనిపోయాడు.

అయితే డాక్టర్లు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సీసీ ఫుటేజీ విడుదల చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మృతుడి పెద్ద కొడుకు-నరేష్ బైట్

ఈ వార్త కూడా చదవండి: దేశంలో మళ్లీ 41వేలు దాటిన కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement