Saturday, May 4, 2024

100 ఏళ్ల వయసులో కరోనాను జయించిన జేజమ్మ!!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు వందలాది మంది మృతి చెందుతున్నారు. అయితే ఇటువంటి సమయంలో 100 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించింది. సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన యాళ్ల సీతారామమ్మ కరోనాను జయించారు. సీతారామమ్మ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్వయాన పెద్దమ్మ. ఈమెకు గత నెలలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. ఇంటి దగ్గర ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అయితే ఆమె వైద్యుల సూచనతో మందులు వేసుకుని భయపడ్డారు. కరోనా బారిన పడిన ఆమె 25 రోజులైందని.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు సీతారామమ్మ చెప్పారు. తన కుటుంబసభ్యులు నిత్యం ఉదయం తేనె కలిపిన నిమ్మరసం, మాంసాహారంతో భోజనం, బొప్పాయి, పళ్ల రసాలు వంటివి ఇచ్చేవారని చెప్పారు. మనోధైర్యంతో మహమ్మారిని జయించానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.కాగా 100 ఏళ్ల వయసులో ఈ మహమ్మారిని జయించి ఎంతోమందిలో ధైర్యం నింపారు సీతారామమ్మ.

Advertisement

తాజా వార్తలు

Advertisement