Friday, May 17, 2024

ఏపీ సర్కార్ పై దేవినేని ఫైర్

ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత‌ దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్‌ను దేవినేని ఉమా ఖండించారు. క‌రోనా స‌మ‌యంలో స‌మ‌ర్థ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోలేని ప్ర‌భుత్వం తప్పుడు కేసుల‌తో మ‌భ్య‌పెట్టాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ‘హార్ట్ సర్జరీ జరిగిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును 35 మందితో అక్రమంగా అరెస్ట్ చేయించారు. అక్రమ కేసులు బనాయించి బలవంతంగా కారులో తీసుకెళ్లారు. వాక్సిన్లు తెప్పించలేరు.. అంబులెన్సులను బోర్డర్ దాటించలేరు. ప్రజల ప్రాణాలు కాపాడలేరు. తప్పుడు కేసులతో ప్రభుత్వానికి లేని ప్రతిష్ఠ‌ ఎలా వస్తుంది వైఎస్ జ‌గ‌న్?’ అని దేవినేని ఉమ ట్విట్టర్ లో ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement