Thursday, April 25, 2024

మాస్కు పెట్టుకోలేదని బీ ఫార్మసీ విద్యార్థిని కుమ్మేసిన పోలీసులు

ములుగు జిల్లాలో పోలీసులు పైశాచికం చూపించారు. ఓ వ్యక్తిపై లాఠీలతో ఒళ్లంతా చితకబాదారు. అంతేకాకుండా తమ పేర్లు బయటకు చెబితే కేసులు పెట్టి జైల్లో పెడతామని కూడా బెదిరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే. ములుగు జిల్లా టూరు నాగారం లో రామన్నగూడెం గ్రామానికి చెందిన వేణు అనే బీ ఫార్మసీ విద్యార్థి మాస్కు పెట్టుకోలేదని చితకబాదాడు ఎస్ఐ. ఇక పోలీసులు కొట్టిన దెబ్బలతో ఒళ్లంతా వాతలతో తీవ్ర గాయాలై బాధితులు వేణు ఆస్పత్రిలో చేరాడు.

కరోనా నిబంధనల పేరుతో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తనను గొడ్డును బాదినట్లు కొట్టారని కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి లకు, ఉన్నతాధికారులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తన పేరు బయటకు చెబితే వేరే కేసులు పెట్టి జైల్లో వేస్తానని ఎస్సై బెదిరించారని బాధిత విద్యార్థిని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement