Monday, April 29, 2024

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల ప్రభన్యూస్‌ : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి బుద్ద పౌర్ణమి సందర్భంగా గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు గరుడుని పై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement