Friday, May 17, 2024

తెలంగాణ‌లో అధికారికంగా క్రిస్మస్ వేడుక‌లు : మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట : దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరిపిస్తున్నారని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. పేదలకు సహాయం చేయడమే పరమావధిగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందని, పేదలు తమకు ఆత్మబంధువలన్నారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా సిద్ధిపేట సిల్లా కేంద్రంలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ భారత దేశం భిన్నత్వంలో ఏకత్వమని, అన్నీ కులాలు, మతాలు కలిసి ఉన్న దేశమని తెలిపారు. సిద్ధిపేట సీఎస్ఐ చర్చి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement