Monday, April 29, 2024

అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి : ప్ర‌భుత్వ విప్ రేగా కాంతారావు

అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని, ప‌ట్ట‌ణాల్లోని స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టి క‌ప్పుడు ప‌రిష్క‌రించాల‌ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో లోని ఎస్బిఐ బ్యాంకు పక్కన గల కట్ట వాగు వద్ద పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న పనులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఆయా ప‌ట్ట‌ణాల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement