Sunday, April 28, 2024

ఓబిసి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఓబీసీ జాబితాలను ఖరారు చేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఓబీసీ కులాల జాబితాను రూపొందించుకునే అధికారం రాష్ట్రాలకే దక్కుతుంది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే అప్పగిస్తూ చట్ట సవరణ చేశారు. ఈ 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. ఓబీసీ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, పలు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించేందుకు మార్గం సుగమం అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement