Tuesday, April 30, 2024

తార‌క‌ర‌త్న మృతి.. ఎన్టీఆర్30 లాంచ్ కార్య‌క్ర‌మం వాయిదా

ఫిబ్ర‌వ‌రి 24న స్టార్ హీరో ఎన్టీఆర్ న‌టిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ని లాంచ్ చేస్తామని గతంలో ప్రకటించారు మేకర్స్.కాగా తారకరత్న మృతి నేపథ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్విట్ట‌ర్ లో తెలిపారు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రత్నవేల్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. గతంలో తారక్, కొరటాల కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్‌.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కొత్త తేదీని సరైన సమయంలో తెలియజేస్తామని చెప్పారు. ప్ర‌స్తుతం చిన్న వయసులోనే నటుడు తారకరత్న అకాల మరణం చెందడంతో నందమూరి కుటుంబం తల్లడిల్లుతోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమా వాయిదా పడింది. ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందుతున్న సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 24న లాంచ్ కావాల్సి ఉంది. అయితే తారకరత్న మరణంతో సినిమా ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. ఎన్టీఆర్‌ 30 మూవీని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలోనే ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement