Sunday, April 28, 2024

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. అక్టోబర్ 11నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీట్లను భర్తీచేయనున్నారు. జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌ 2022లో అర్హత సాధించిన అభ్యర్దులు నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్టోబర్‌ 11న ఉదయం 10 గంటల నుంచి 18న సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్దులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నిర్ధేశిత దరఖాస్తు పూర్తిచేయడంతో పాటుఅభ్యర్ధులు సంబంధిత ధృవపత్రాలను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధృవపత్రాలను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS. Telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement