Wednesday, May 1, 2024

నిరుద్యోగులకు మరో శుభవార్త.. డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 53 డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (వర్స్క్‌) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సంబంధిత వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. ప్రభుత్వం విడతల వారిగా ఒకదాని తర్వాత మరోకటి ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తూ వస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement