Thursday, May 2, 2024

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తూనే ఉంటా : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేక్ కట్ చేశారు. అనంత‌రం ఆమె ప్ర‌సంగించారు. ముందుగా ‘అందరికీ నమస్కారం’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె.. ‘ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు.. మీ సహోదరిని’ అని వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రానికి గవర్నర్‌గా సేవ చేస్తూ.. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని తమిళిసై అన్నారు. సవాళ్లు ఎదురవుతున్నా తాను బాధపడటం లేదని చెప్పారు. ఎవరు ఆపినా.. తెలంగాణ ప్రజలను కలుస్తాను.. కలుస్తూనే ఉంటాను అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని ప్రకటించారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. ప్రసంగమంతా తెలుగులోనే సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement