Saturday, May 4, 2024

ఏపీలో మాస్క్ లేకపోతే అక్కడికి నో ఎంట్రీ

ఏపీలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు APSRTC కూడా అప్రమత్తమైంది. మహమ్మారిని అరికట్టేందుకు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది. అందులో భాగంగానే మాస్కులు ధరించకుండా వచ్చేవారిని బస్సులు, బస్టాండ్లలోకి అనుమతించమని స్పష్టం చేసింది.

దీనిపై అవగాహన పెంచేందుకు డిపోల్లో ప్రత్యేక డ్రైవ్స్ కూడా నిర్వహిస్తోంది. ప్రయాణికులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతూ కరోనా పై అవగాహనా కల్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement