Sunday, May 5, 2024

BREAKING -ఏపీలో నైట్ కర్ఫ్యూ… శనివారం నుంచి అమలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అలాగే అత్యవసర సేవలు, రవాణాకు అనుమతి మాత్రం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక గడిచిన గత కొన్ని రోజులుగా ఏపీలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. 24 గంటల్లో పదివేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement