Sunday, April 28, 2024

ఏపీలో కొత్తగా 3797 కరోనా కేసులు

ఏపీలో నాలుగువేలకు దిగువున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 97,696 సాంపిల్స్ ని పరీక్షించగా 3,797 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల ప్రకాశం లో ఎనిమిది, చిత్తూర్ లో ఏడుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, గుంటూరు లో ఒక్కరు, నెల్లూరు లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 5,498 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,19,93,618 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం కేసుల సంఖ్య…1889513

యాక్టీవ్ కేసుల సంఖ్య….38338

- Advertisement -

డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1838469

మృతుల సంఖ్య…12706

Advertisement

తాజా వార్తలు

Advertisement