Wednesday, April 24, 2024

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్!

మీకు బ్యాంకు ఖాతా ఉందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. జులై 1 నుంచి ఎన్నో మార్పులు రానున్నాయి. కొన్ని బ్యాంకులు తమ సర్వీస్​ ఛార్జీలు పెంచగా.. మరికొన్ని ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లే చెల్లవని చెప్పాయి. మరి ఏఏ బ్యాంకులు ఏం మార్పులు చేశాయో, కస్టమర్లు ఏం చేయాలో తెలుసుకోండి. బ్యాంకు ఖాతాదారులంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. జులై 1 నుంచి ఏటీఎంలో నగదు ఉపసంహరణ మొదలుకొని.. కొత్త ఐఎఫ్​ఎస్​ఎస్​ కోడ్​ల వరకు ఎన్నో మార్పులు రానున్నాయి.

జులై 1 నుంచి వచ్చే మార్పులివే..

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్​బీఐ.. సేవింగ్స్​ ఖాతాదారులకు షాక్​ ఇచ్చింది. ఛార్జీలు పెంపు నగదు ఉపసంహరణ సేవల్లో స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా పలు మార్పులు చేసింది. తమ బ్యాంకు ఏటీఎంల నుంచి నాలుగు లావాదేవీలు మాత్రమే ఉచితంగా చేసుకునే వీలు కల్పించనుంది. ఆ పరిమితి దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్​కు రూ. 15 (జీఎస్​టీ అదనం) వసూలు చేయనుంది. ఇక, చెక్​ బుక్​ వినియోగంపై పరిమితులు విధించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 10 చెక్కులను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. ఇంకా కావాలాంటే.. అదనంగా ఛార్జీలు విధించనుంది. 10 చెక్స్​- రూ.40+ జీఎస్​టీ, 25 చెక్స్- రూ. 75+జీఎస్​టీ సీనియర్​ సిటిజన్లకు మాత్రం ఈ నిబంధన వర్తించదు.

సేవింగ్స్​ ఖాతాదారులకు పలు సర్వీస్​ ఛార్జీలను యాక్సిస్​ బ్యాంకు పెంచింది. ఇప్పటికే వీటిలో కొన్ని మే 1 నుంచి అమల్లోకి రాగా.. సవరించిన మరికొన్ని జులై 1 నుంచి అమలు కానున్నాయి. ఇందులో భాగంగా.. ఎస్​ఎంఎస్​ అలర్ట్​కు కూడా డబ్బులు వసూలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. టెలికాం శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క అలర్ట్​కు రూ. 25 పైసల చొప్పున గరిష్ఠంగా నెలకు 25 రూపాయల వరకు ఛార్జీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది నెలకు రూ. 5గా ఉండేది. ప్రమోషనల్​ మెసేజ్​లు, వన్​ టైం పాస్​వర్డ్​ ఓటీపీలకు ఎలాంటి ఛార్జీ చేయబోమని స్పష్టం చేసింది. సేవింగ్స్​ అకౌంట్​లో ఉండాల్సిన కనీస మొత్తాన్ని కూడా పెంచింది. దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు అయిన యాక్సిస్​ బ్యాంక్​కు.. 20 కోట్లకుపైగా వినియోగదారులు ఉన్నారు. సిలిండర్​ ధరల పెంపు.. ఎల్​పీజీ సిలిండర్ల ధరలు.. ప్రతి నెలా మొదటి రోజే నిర్ణయిస్తారు. ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ.. జులై 1 నుంచి ఈ ధరలు పెరుగుతాయని తెలుస్తోంది. గత రెండేళ్లుగా పన్ను చెల్లింపులు చేయని వారికి.. టీడీఎస్​ రేట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇది జులై నుంచే అమల్లోకి రానుంది.

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో వీలినమైన ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్​ బ్యాంక్​ ఖాతాదారులు కొత్త చెక్​ బుక్​లు తీసుకోవాలని సూచించింది. పాతవి జులై 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది. ఆ ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లు బంద్​! సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులంతా వెంటనే తమ ఐఎఫ్​ఎస్​సీ కోడ్, చెక్​బుక్​లు అప్​డేట్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ సూచించింది. సిండికేట్ బ్యాంక్ గత ఏడాది కెనరా బ్యాంక్​లో విలీనమైన కారణంగా.. పాత ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లు, చెక్​ బుక్​లు జులై 1 నుంచి చెల్లవని స్పష్టం చేసింది. ఈ విషయమై ఇప్పటికే సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులందరికీ ఎస్ఎంఎస్​ ద్వారా సమాచారమిచ్చినట్లు వెల్లడించింది.

- Advertisement -

ఐఎఫ్​ఎస్​సీ కోడ్​లో మార్పు ఎందుకు?

బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 2019లో 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మెగా విలీనం 2020 ఏప్రిల్​ నుంచి అమలులోకి వచ్చింది. ఈ ప్లాన్​లో భాగంగా సిండికేట్ బ్యాంక్​ కెనరా బ్యాంక్​లో విలీనమైంది. దీంతో సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్​ఎస్​సీ కోడ్ స్థానంలో తమ బ్యాంక్​ ఐఎఫ్​ఎస్​సీ కోడ్​ను వినియోగంలోకి తీసుకొస్తోంది కెనరా బ్యాంక్. ఇంకా కార్పొరేషన్​ బ్యాంక్​, ఆంధ్రా బ్యాంక్​.. యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాలో విలీనమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement