Sunday, May 5, 2024

ఎన్బీకే 107 అప్ డేట్

హీరో బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని సినిమాను పూర్తి చేస్తున్నారు. అవుట్‌ అండ్ అవుట్‌ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశలో ఉంది. చిత్రయూనిట్‌ తాజాగా మరో బిగ్‌ అప్‌డేట్‌ ప్రకటించింది. ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్‌ 21న రివీల్‌ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా టైటిల్‌ లోగోను కర్నూల్‌లోని కొండా రెడ్డి బురుజు దగ్గర లాంచ్‌ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. అయితే టాలీవుడ్‌ చరిత్రలో టైటిల్‌ లోగో లాంచ్‌ కోసం ప్రోగ్రామ్ చేయడం అనేది ఇదే మొదటి సారి. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement