Friday, April 26, 2024

వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

పల్నాడు: ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చినా వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని, సీఎం జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగు చెందార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లాలో వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. భారీ వర్షాలకు మిరప, పత్తి పంట దెబ్బతిన్నదని తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం జగన్‌ సర్కార్‌కు లేదని తప్పు బట్టారు. వైసీపీకి రైతుల‌పై ఎలాంటి ప‌ట్టింపు లేద‌ని, వరద ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం పట్ల ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. ఏపీలో ప్రజా స్వామ్యాన్ని కాపాడటంలో భాగంగానే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కు సంఘీభావం తెలిపానని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement