Monday, May 6, 2024

National – పోలీసులు – మావోయిస్ట్ ల మ‌ద్య కాల్పులు .. ఒక న‌క్స‌లైట్ మృతి..

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. శనివారం ఉదయం సుక్మా జిల్లాలోని బుర్కలంకా అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వారికి తారసపడిన మావోయిస్టులు.. కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించాడని జిల్లా ఎస్పీ కిరణ్‌ చౌహాన్‌ చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అతడిని గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement