Saturday, April 27, 2024

ప్రభుత్వ పథకాల్లో నరేంద్రమోడీ ఫోటో ఉండాల్సిందే – బిజెపి నేత ఆంజనేయులు

తాడిపత్రి (ప్రభ న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీ ఫోటో ప్రవేశ పెట్టాలని భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షుడు మైదుకూరు ఆంజనేయులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారతి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కళ్యాణ్ యోజన, ఉచిత రేషన్ పంపిణీ తదితర సంక్షేమ పథకాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని స్పందన కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు శివ, సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement