Sunday, April 28, 2024

MI vs RCB | చెల‌రేగిన ముంబయి.. ఆర్సీబీపై ఘ‌న విజ‌యం

భారీ ఛేద‌న‌లో ముంబై ఇండియ‌న్స్ చెల‌రేగింది. ఆర్సీబీ నిర్ధేశించిన 197 టార్గెట్‌ను 16 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబై ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్(69), రోహిత్ శ‌ర్మ‌(38)తో బౌండ‌రీల మోత మోగించారు. ఇషాన్ ఆర్సీబీ బౌలర్లను ఉతికేశాడు. 23 బంతుల్లోనే ఇషాన్ 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

ఆ తరువాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (52) కూడా విజృంభించాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తిలక్ వర్మ 16 నాటౌట్ ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 21 (నాటౌట్) విన్నింగ్ షాట్ ఆడి జట్టును గెలిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement