Sunday, April 28, 2024

AP | 12న‌ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో జరిగిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. నేటి ఉదయం 11 గంటలకు ద్వితీయ సంవత్సరం జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలను తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేయనున్నారు. ఈ యేడాది గత మార్చి నెలలో జరిగిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 1559 సెంటర్లలో నిర్వహించారు. పరీక్షలకు జనరల్‌, ఒకేషనల్‌ గ్రూపులకు చెందిన 5,35,056 మంది విద్యార్ధులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement