Friday, May 17, 2024

అంబానీ ఇంటివద్ద బాంబు కారు కేసు అప్డేట్..

ముకేశ్ అంబానీ ఇంటిముందు.. బాంబులతో కూడిన కారును నిలిపి ఉంచిన కేసులో ముంబై మాజీ పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో కేసుకు సంబంధించి ఇప్పటికే సచిన్ వాజేను సస్పెండ్ చేశారు అధికారులు. ఇప్పుడ మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ముంబైలోని సీసీటీవీలను పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. కేసుకు సంబంధించి హత్యకు గురైన మన్సుఖ్ హిరేన్ ను వాజే పలుమార్లు కలిసినట్టు తేలింది. అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన కారును నిలిపి ఉంచిన ఘటనకు ముందు ఫిబ్రవరి 17న ముంబైలోని జీపీవో దగ్గర హిరేన్ తో పది నిమిషాల పాటు సచిన్ వాజే చర్చలు జరిపినట్టు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement