Thursday, April 25, 2024

ఐదు వేలకు పైగా స్క్రీన్ లలో.. పఠాన్

పఠాన్ చిత్రం 5000లకు పైగా స్క్రీన్‌లలో రిలీజ్‌ కాబోతుందట.బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్‌ ఫిలింస్‌లో బ్యానర్‌లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సినిమా ఇండియాలో పెద్ద ఎత్తున రిలీజ్ కానుంద‌ట‌. హిందీ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇండియాలో దాదాపు షారుఖ్ సినిమా ఇంత పెద్ద మొత్తంలో రిలీజవడం ఇదే మొదటి సారి. అంతేకాకుండా ఈ సినిమాకు ఏమాత్రం పాజిటీవ్‌ టాక్‌ వచ్చిన మొదటి రోజే రూ. 40కోట్ల నెట్‌ కలెక్షన్‌లు రాబడుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే షారుఖ్‌ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా మిగిలిపోతుంది.సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వహించిన ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement