Wednesday, April 24, 2024

ఈ టీలో విషం క‌లిపారేమో.. పోలీసుల‌ను నేను న‌మ్మ‌ను.. అఖిలేశ్ యాద‌వ్

పోలీసులు ఇచ్చిన టీలో విషం ఉందేమో అన్నారు స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాద‌వ్. కాగా ఉత్తరప్రదేశ్ పోలీసులు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్ ను నేడు అరెస్ట్ చేశారు. దాంతో ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్నోలో పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు… అఖిలేశ్ యాదవ్ కు టీ ఇవ్వడానికి వెళ్లారు. అయితే పోలీసులు ఇచ్చిన టీ తాగేందుకు అఖిలేశ్ యాదవ్ అంగీకరించలేదు. ఒకవేళ మీరు దీంట్లో ఏదైనా విషం కలిపి ఉంటే.. అంటూ సందేహం వ్యక్తం చేశారు. నేను ఈ టీ తాగను… మిమ్మల్ని ఎలా నమ్మగలను అంటూ అఖిలేశ్ ఆ టీ నిరాకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement