Wednesday, May 15, 2024

ఏపీలో కరోనా కాటుకు కొత్తగా 38 మంది బలి

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 9,716 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 38 మంది కరోనా కారణంగా మృతి చెందారు. మృతి చెందిన వారిలో కృష్ణా జిల్లాలో 10మంది, నెల్లూరులో 7, తూ.గో, శ్రీకాకుళంలో నలుగురు
చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరు, కర్నూలు,
విశాఖలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు మరణించారు.

ఇక తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 9,86,703 మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు. మృతుల సంఖ్య 7,510కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 9,18,985 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement