Thursday, May 2, 2024

ఇండియాకు గండం తప్పేలా లేదు…కొత్తగా 44వేలకు పైగా కరోనా కేసులు

ఇండియా లో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 16,40,287 మందికి పరీక్షలు చేయగా.. 44,643 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అలాగే కొత్తగా 464 మంది కరోనా తో మృతి చెందారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 3.18 కోట్లకు చేరింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 4.26 లక్షలకు చేరింది.

ఇక ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,14,159గా ఉన్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లో 41వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే ఇప్పటివరకు మొత్తం డోసుల సంఖ్య 49.5 కోట్ల మార్కును దాటింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement