Thursday, May 9, 2024

మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు-సాయిబాబా ద‌ర్శ‌నం కోసం ఇక‌పై షిరిడీకి వెళ్లన‌వ‌స‌రం లేదు

సాయిబాబా ద‌ర్శ‌నం కోసం ఇక‌పై షిరిడీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టుడు..మాజీ ఎంపీ మోహ‌న్ బాబు తెలిపారు. శ్రీ బాలాజీ జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌మ విద్యాసంస్థ శ్రీ విద్యానికేత‌న్ స‌మీపంలో మోహ‌న్ బాబు కుటుంబం నూత‌నంగా సాయిబాబా ఆల‌యాన్ని నిర్మించింది. ఈ ఆల‌యానికి సంబంధించి విగ్ర‌హ ప్ర‌తిష్ఠాప‌న కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ వేడుక‌లో మాట్లాడిన సంద‌ర్భంగానే మోహ‌న్ బాబు ఈ వ్యాఖ్య‌లు చేశారు. రంగంపేట‌లో నిర్మిస్తున్న సాయిబాబా గుడి ద‌క్షిణాదిలోనే అతి పెద్దద‌ని ఈ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు అన్నారు. ఇదొక అద్భుత‌మ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న దృష్టిలో ఇక‌పై సాయినాథుని ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు షిరిడీ ఆల‌యానికి వెళ్ల‌క్క‌ర్లేద‌ని ఆయ‌న అన్నారు. త‌మ కుటుంబం నిర్మించిన ఆల‌యం విశిష్ట‌త‌ను చెప్పే క్ర‌మంలోనే మోహ‌న్ బాబు ఈ వ్యాఖ్య‌లు చేసినా సాయిబాబా భ‌క్తులు ఇక‌పై షిరిడీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న వ్యాఖ్య‌లు భ‌క్తుల‌ను అసంతృప్తికి గురి చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement