Tuesday, April 30, 2024

ఇషాంత్ స్థానంలో సిరాజ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా దెబ్బతిన్న నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం తుదిజట్టులో మార్పులు చేయబోతోంది. WTC ఫైన‌ల్లో హైద‌రాబాదీ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ ఉండి ఉంటే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని మ్యాచ్ త‌ర్వాత కొంద‌రు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ మ‌ళ్లీ ఆ పొర‌పాటు చేయ‌కూడ‌ద‌ని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందుకే తుది జ‌ట్టులో సీనియ‌ర్ పేస‌ర్ ఇషాంత్ శ‌ర్మ స్థానంలో సిరాజ్‌ను తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో త‌న టెస్ట్ కెరీర్ ప్రారంభించిన సిరాజ్‌.. త‌న బౌలింగ్‌తో అద‌ర‌గొట్టాడు. మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి.. సిరీస్‌లో ఇండియా త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా నిలిచాడు.

ఈ వార్త కూడా చదవండి: ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్

Advertisement

తాజా వార్తలు

Advertisement