Sunday, April 28, 2024

ధోనీ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..

మిస్ట‌ర్ కూల్‌ ధోనీ మ‌రో రెండేళ్లు చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఆడ‌తాడ‌ని ఆ టీమ్ సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ వెల్ల‌డించారు. అత‌డు క‌నీసం మ‌రో ఏడాది, రెండేళ్లు సీఎస్కేతోనే కొన‌సాగుతాడు. అత‌డు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. అత‌డు కొన‌సాగ‌క‌పోవ‌డానికి ఎలాంటి కార‌ణం లేదు అని ఆయ‌న చెప్పారు. ఏడాది ఐపీఎల్‌లో ఓ ప్లేయ‌ర్‌గా ధోనీ పెద్ద‌గా రాణించ‌క‌పోయినా కెప్టెన్‌గా టీమ్‌ను ముందుండి న‌డిపించాడు.

క‌రోనా కార‌ణంగా టోర్నీ అర్ధంత‌రంగా ముగిసే స‌మ‌యానికి పాయింట్ల టేబుల్లో చెన్నై రెండో స్థానంలో ఉంది. బ్యాట్స్‌మ‌న్‌గా ధోనీ ఫామ్‌లో లేక‌పోయినా.. చెన్నై టీమ్ మాత్రం ఇప్ప‌టికీ అత‌ని సామ‌ర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవ‌ని చెబుతోంది. మా వ‌ర‌కూ అత‌డు చెన్నై టీమ్‌కు చేస్తున్న సేవ‌లు చాలా సంతృప్తిక‌రంగా ఉన్నాయి. కెప్టెన్‌గా, నాయ‌కుడిగానే కాదు.. ఓ ప్లేయ‌ర్‌గా కూడా టీమ్‌కు ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌డ‌న్న న‌మ్మ‌కం మాకు ఉంది. అత‌డో మంచి ఫినిష‌ర్‌. ఇప్ప‌టికే అదే చేయ‌గ‌ల‌డు అని విశ్వ‌నాథ‌న్ అన్నారు.

ఇది కూడా చదవండి: గబ్బర్‌ సేన ఏ జట్టునైనా ఓడిచగలదు: బ్రాడ్‌హగ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement