Saturday, May 4, 2024

TS: మోదీ వ‌చ్చి ఆదిలాబాద్ కు గుండు సున్నా విదిల్చారు – జోగు రామ‌న్న

ఆదిలాబాద్ – దేశ ప్రధాని పర్యటనపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. అదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్స్ టైల్ పార్కు ఇవ్వలేదంటూ అస‌లు మోడీ ఎందుకు వచ్చినట్టు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఆదిలాబాద్ పై చిన్న చూపు చూసారని, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. న‌లుగురు ఎమ్మెల్యేలను ప్రజలను గెలిపిస్తే మీరిచ్చే గౌరవం ఇదేనా అని ఆయన మండిపడ్డారు. ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఎన్నికల సభ నిర్వహించారని మండిప‌డ్డారు.. మోడీ, రేవంత్ రెడ్డిలు ఒక్కరికి ఒక్కరు పొగుడు కోవడం తప్పా జిల్లా ప్రజలకు ఒరిగింది ఏంటని నిల‌దీశారు.


ఆదిలాబాద్ కు ఇచ్చింది గుండు సున్నా అని ఆయన ధ్వజమెత్తారు. ఆదివాసీలు అని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు ఆదివాసీ అయిన సిట్టింగ్ ఎంపీకి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఏ టీం, బీ టీం లు అని ఆయన అన్నారు. నిన్నటి సభతో కాంగ్రెస్, బీజేపీ నేతల రహస్య ఒప్పందం బయట పడిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు గ్యారెంటీల పాట పాడుతున్నార‌ని ఎద్దేవా చేశారు.. నిన్నటి దాకా చౌకిదారు.. ఇప్పుడు మోడీకా పరివార్ అంటా అని మోడీని దెప్పి పొడిచారు… వారసులు ఉంటే తప్పేం కాద‌ని, అంటూ త‌మ‌రికి వారసులు లేక త‌మ పార్టీల నుంచి తీసుకొని తెల్లారే వారికి టికెట్లు ఇస్తున్నారన్నార‌ని విమ‌ర్శించారు.. ఈసారి ఎన్నిక‌ల‌లో బీజేపీ ఎంపీ ఎన్నికల్లో మొదట ఓడిపోయే సీట్లు సికింద్రాబాదే అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement