Tuesday, May 7, 2024

నా విజయం కేసీఆర్ కు అంకితం…పల్లా

నల్గొండ,ఖమ్మం,వరంగల్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలిచారు. మరోవైపు మహబూబ్ నగర్ హైదరాబాద్, రంగారెడ్డి ఎన్నికల్లో కూడా తెరాస గెలిచింది. నాలుగు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.

నల్గొండ,ఖమ్మం,వరంగల్‌ స్థానంలో అభ్యర్థుల మధ్య పోటీలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి గెలుపునకు 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దీంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును మొదలు పెట్టారు. ఈ స్థానం నుంచి మొత్తం 71 మంది బరిలో నిలిచారు. ఈ స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లు ఉండగా, 3,87,969 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో 3,66,333 చెల్లినవి కాగా, 21,636 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,11,812 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 84,118 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరాంకు 71,126, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డికి 39,306, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,729 ఓట్లు వచ్చాయి.

ఇక విజయం సాధించిన తరువాత మీడియాతో మాట్లాడిన పల్లా ఈ విజయం కేసీఆర్ కి అంకితమన్నారు.గత కొంతకాలంగా ప్రభుత్వం మీద అవాకులు, చవాకులు పేలిన ప్రతిపక్షాలకు ఈ విజయం చెంపపెట్టు. వారణాసి లాంటి ప్రాంతాల్లో పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులను తిరస్కరించారు. మేము చేసిన పనులే ప్రజలకు చెప్పాము అదే మమ్మల్ని గెలిపించింది.ఎన్నికలు అధ్బుతంగా నిర్వహించిన ఆర్వో, అధికారులు, సిబ్బంధికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement