Monday, April 29, 2024

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. విచారణ సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణ సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు తెలిపింది. హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలో విచార‌ణ జ‌ర‌గాల‌ని తెలిపింది. ద‌ర్యాప్తు త్వ‌ర‌గా పూర్తి చేసి ఈనెల 29 నాటికి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. ద‌ర్యాప్తున‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించ‌వ‌ద్ద‌ని హైకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement