Friday, May 17, 2024

22 మందితో ప్ర‌యానిస్తున్నవిమానం మిస్సింగ్.. క్రాష్ ల్యాండ్ అయిన‌ట్టు గుర్తించిన అధికారులు..

నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ కు చెందిన విమానం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ అయిందివ. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సిగ్నల్ క‌నెక్ష‌న్ కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు అధికారులు. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు.

విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement