Tuesday, May 14, 2024

ఏదుల రిజర్వాయర్ వద్ద రైతన్నల సంబరాలు – కేసీఆర్ కి కృతజ్ఞతలు

పెద్దమందడి; (ప్రభ న్యూస్ – వెయ్యి ఏండ్ల భవిష్యత్తును సీఎం కేసీఆర్ కలగన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాw ee SSTధించిన సంధర్భంగా శనివారం ఏదుల రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన రైతన్నల సంబరాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, భారీ ఎత్తున రైతులు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు ముందే పాలమూరు ఎంపీగా ఉండి తెలంగాణ రావడం ఖాయం .. పాలమూరు రంగారెడ్డితో నీళ్లిస్తాం అని 2009లోనే కేసీఆర్ స్పష్టంగా చెప్పారు అని అన్నారు.అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ ప్రాజక్టులు పూర్తిచేశారని,కొత్తగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 జులై 11న శ్రీకారం చుట్టారనీ అన్నారు.

పాలమూరు రంగారెడ్డి పూర్తి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలు, రంగారెడ్డి, నల్గొండల్లో 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు. ప్రాజెక్టు కట్టకుండా అనేక రకాల కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు.రూ.5 లక్షల చొప్పున రైతులకు ఇచ్చి వారి సహకారాలతో ప్రాజెక్టు పనులు తుది దశకు తీసుకువచ్చామన్నారు. నీళ్ల కేటాయింపు లేదని కేంద్రం, అంధ్రా ప్రభుత్వాలు అడ్జుపుల్లలు వేశాయనీ కృష్ణా నీటి వాటా తేల్చకుండా కేంద్రం 9 ఏళ్లుగా నాన్చుతున్నదని విమర్శించారు.నీటి వాటా తేల్చలేని కేంద్రం ఈ దేశంలో ప్రజలను బాగుచేస్తుందా అని ప్రశ్నించారు. నీటి వాటా ఎప్పుడైనా తేల్చుకోండి మేం ప్రాజెక్టు కట్టడం ఖాయం అని కేంద్రానికి స్పష్టం చేశామన్నారు.

.కేంద్రం xxకేసీఆర్ అధిగమించి పర్యావరణ అనుమతులు సాధించామన్నారు. ఇదొక చారిత్రక ఘట్టం చరిత్రలో చాలా తక్కువ నమోదయిన సంధర్భమని సంతోషం వ్యక్తం చేశారు.ఎవరూ కలగనలేదు .. ఇక్కడ ప్రాజెక్టు వస్తది, లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని మొత్తం 90 టీఎంసీల నీళ్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నామని తెలిపారు.అన్ని నీళ్లు ఒక్కసారిxg నిలుపుకుంటే భూగర్భజలాలు ఉబికి వస్తాయని,భవిష్యత్ లో ఒకటి, రెండేళ్లు వానలు రాకున్నా వ్యవసాయానికి ఢోకా ఉండదన్నారు. కెసిఆర్ దక్షతను తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.ఆయన గులాబీ జెండా ఎగరేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,రాష్ట్రం తెచ్చిన కేసీఅర్ కు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు

. నేడు దే’ggg©°xశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అX:భివృద్ధితో పోటీ పడలేదని అన్నారు.ఒకనాడు నీళ్లకు గతిలేని స్థితి .. పశువులకు గడ్డి లేని పరిస్థితినేడు తెలంగాణలో పండే పంటలు కొనలేమని కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందన్నారు.ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రతి కుటుంబానికి పథకం అందుతుందని అన్నారు.ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయ చేతగాని నాయకులు ఎన్నికలు దగ్గరకు రాగానే ఊర్ల మీద పడ్డారని అన్నారు.60 ఏళ్లు గత పాలకులు, నాయకులు పాలమూరును ఎడారి చేస్తే కేసీఆర్ పచ్చదనంతో నింపారని తెలిపారు. నీళ్లు, కరంటు, విద్య, వైద్యం అన్ని రంగాలలో కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. మీ వద్దకు వచ్చే నాయకులతో కేసీఆర్ చేసినవి చెప్పి వాళ్లం చేస్తారో అడగండని అన్నారు. లోకమున్నంత వరకు వ్యవసాయం ఉంటుంది .. అందుకే కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారనీ అన్నారు.అండగా నిలిచిన కేసీఆర్ గారికి మీరందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్బంగా ఏదుల రిజర్వాయర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, ప్రజలు పాలాభిషేకం చేశారు. ఈ సంధర్భంగా పెద్దమందడి, ఖిల్లాఘణపూర్ మండలాల నుండి 250 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.వనపర్తి నుండి ఏదుల రిజర్వాయర్ వరకు 300 బైకులతో యువకుల భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఏదుల పంపు హౌస్ ను మంత్రి సింగిరెడ్డి రెడ్డి సందర్శించారు

- Advertisement -

. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్. మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్. అనపర్తి మార్కెట్ చైర్మన్ రమేష్ గౌడ్. జిల్లా గ్రంథాల చైర్మన్ లక్ష్మయ్య. జిల్లా రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి. జెడ్పిటిసి రఘుపతి రెడ్డి. సింగల్ విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. పెద్దమందడి మండల రైతుబంధు అద్యక్షులు రాజప్రకాష్ రెడ్డి. మాజీ సింగల్ విండో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి. మాజీ ఎంపీపీ మన్నెపు రెడ్డి. జిల్లా గొర్రెల సంఘం డైరెక్టర్ నాగేంద్ర యాదవ్. పెద్దమందడి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్. వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement