Tuesday, April 30, 2024

చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ మంత్రి ఆర్ కే రోజా మ‌రోసారి నిప్పులు చెరిగారు. శ‌నివారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముసలి నాయకుడ‌ని, మూలకు కూర్చోవాల్సిందేనని చురకలు అంటించారు. జ‌గ‌న‌న్న‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉంద‌ని.. మాకు వస్తున్న స్పందన చూస్తేనే అర్థం అవుతుందని వివరించారు. ప్ర‌జ‌ల ఇంటికే ప్ర‌భుత్వం అనేరీతిలో జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే మా వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు వెళుతున్నార‌ని, వారి సమస్యలు నేరుగా తెలుసుకుని ప‌రిష్క‌రిస్తున్నామ‌న్నారు. ఏడు లక్షల మంది జగన్ సైనికులు 63 లక్షల 93 వేల మంది ఇళ్ల‌కు వెళ్లారన్నారు. జగన్ స్టిక్కర్లు చూస్తే చంద్రబాబు గుండెల రైళ్లు ప‌రిగెడుతున్నాయ‌న‌న్నారు. కొంత‌మంది ఓర్వ‌లేక త‌మ నాయ‌కుడి స్టిక్క‌ర్ల‌ను తొల‌గిస్తున్నార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారో చెప్పాల‌న్నారు. చంద్రబాబు దిగుతున్నది సెల్ఫీలు కాదు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు.. మూలన కూర్చోకుండా ఇంకా కుట్రలు పన్నుతున్నాడని మంత్రి రోజా మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement