Thursday, April 25, 2024

చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్

హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మంత్రి కేటీఆర్ 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో స్వచ్ఛ వాహనాలను తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని చెత్త కుండీలు లేని నగరంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ప్రజలు కూడా తమ బాధ్యతగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను స్వచ్ఛంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ 650 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసిందని.. ఇందులో భాగంగా ఈరోజు 325 ఆటోలను ప్రారంభించడం జరిగిందన్నారు.

అటు దేశంలోని అన్ని నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. కరోనా నేపథ్యంలో స్వచ్ఛత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ కార్యక్రమంలో నగర మేయర్ విజయలక్ష్మీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement