Saturday, April 27, 2024

ఉంగుటూరులో మంత్రి కారుమూరి ప‌ర్య‌ట‌న‌.. రైతులతో ముచ్చ‌టించిన మంత్రి..

ఉంగుటూరు, ప్రభ న్యూస్ : రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం ఉంగుటూరు మండలంలో పర్యటించారు. తొలుత ఉంగుటూరు వద్ద హైవేపై ఆరబోసిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. అనంత‌రం రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు తమకు సంచులు అందలేదని ట్రాన్స్ పోర్టేషన్ సక్రమంగా లేదని మంత్రి దృష్టికి తీసుకురావడంతో సమస్యను తక్షణం పరిష్కరించాలని అధికారులను మంత్రి కారుమూరి ఆదేశించారు. మిల్లు యాజమాన్యం ధాన్యం దింపుకోవడానికి డబ్బులు అడుగుతున్నారని ఒక రైతు మంత్రి ద్రుష్టికి తీసుకురాగా.. మిల్లర్లతో ఫోన్ సంభాషించిన మంత్రి మిల్లర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.. బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement