Wednesday, May 1, 2024

హ‌రీష్ రావు సూచ‌న‌ల మేర‌కు.. సమన్వయ కమిటీ మీటింగ్..

సిద్దిపేట : పట్టణంలో కమిటీల ఏర్పాటుకు ఇటీవల మంత్రి హరీష్ రావు .. ఐదు మంది సభ్యులతో సమన్వయ కమిటీని నియ‌మించారు. ఈ క‌మిటీలో పూజల వెంకటేశ్వర్ రావు (చిన్నా) , మచ్చ వేణుగోపాల్ రెడ్డి, లోక లక్ష్మీ రాజ్యం , మోహన్ లాల్, గుండు భుపేష్ లు స‌భ్యులుగా ఉన్నారు. కాగా వీరు మంత్రి క్యాంప్ ఆఫీస్ లో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు.. మంత్రి హరీష్ రావు ఆదేశాలకు 43వార్డుల్లో పార్టీ వార్డు కమిటీ, అనుబంధ కమిటీలు వేయబోతునట్లు చెప్పారు.. ఒక్కో సమనన్వయ కమిటీ సభ్యునికి 8వార్డుల చొప్పున బాధ్యత తీసుకున్నామ‌న్నారు..అదేవిధంగా ప్రతి కౌన్సిలర్ రెండు వార్డుల చొప్పున బాధ్యత నిర్వర్తిస్తారు.. వచ్చే 10రోజుల్లో ఈ కమిటీలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నామ‌ని చెప్పారు. కాగా మంత్రి హరీష్ రావు ఈ నెల 5వ తేదీన పట్టణ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నారని వెల్ల‌డించారు. వారు సూచించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement