Wednesday, May 8, 2024

సిద్దిపేట వెంకన్న స్వామికి స్వర్ణ కిరీటం.. పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు కిరీటధారణ చేయాలని సంకల్పించిన నేపథ్యంలో కిరీట నమూనాను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా 2కిలోలతో చేయించే ఈ బంగారు కిరీటం వెంకన్న తలలో స్వర్ణ ఆభరణం అద్భుతంగా ఉండాలన్నారు.. దేవాలయ నిధులు, దాతల సహకారంతో పాటు త‌న వంతు సహాయ సహకారం అందిస్తాన‌ని మంత్రి చెప్పారు.. పలు నమూనాల‌ను పరిశీలించారు. వెంకటేశ్వర స్వామి భక్తులకు ఏ విధంగా దర్శనమిస్తే బాగుంటుంది.. తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపం మన సిద్దిపేట స్వామి కనపడేలా కిరీట‌ధారణ చేయాలన్నారు.. వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామికి కీరిటధారణ చేసేలా త్వరితగతిన తయారీ జరగాలన్నారు.. ఈ ప్రాంతంలో ఈ స్వామి ఎంతో మహిమాన్వితమ‌ని, నిత్యం భక్తులు కొలిచే సిద్దిపేట వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధిలో విరాజిల్లుతున్నట్లు ఆదిశగా స్వామి వారికి బంగారు కిరీటాన్ని చేయించేందుకు సంకల్పించుకోవడం సంతోషంగా ఉందన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement