Wednesday, May 8, 2024

కలెక్టర్ శివలింగయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్యను హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శనివారం హైదరాబాద్ లోని బోడుప్పల్ లో జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్ళి మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ శివలింగయ్య మామ కొరముల సైనోజు శ్రీరాములు పరమపదించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ లోని వారి ఇంటికి వెళ్ళి మంత్రి ఎర్రబెల్లి పరామర్శించారు. శ్రీరాములు మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. వారి చిత్ర పటానికి పూలు చల్లి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ శివ లింగయ్య దంపతులతో మంత్రి కాసేపు మాట్లాడారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement