Monday, April 29, 2024

జూనియర్ సివిల్ జడ్జిగా మీస కళ్యాణి ఎంపిక

కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మీస కళ్యాణి జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికయ్యారు. ఆమె చిన్న వయసులో (24) లోనే తొలి ప్రయత్నంలోనే ఈ ఉద్యోగాన్ని సాధించారు. తల్లిదండ్రులు మీస వీరయ్య అరుణ లకు చెందిన కళ్యాణి 1నుండి 10వ తరగతి వరకు గోదావరిఖనిలో, ఇంటర్ హైదరాబాద్ లో, ఎల్ఎల్ బి కాకతీయ యూనివర్సిటీ లో చదివారు.

హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ లో 2020 లో ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. చిన్ననాటి నుండి న్యాయ విద్యాభ్యాసం పై అమితాసక్తి ఉండేదని నాటి నుండి ఉన్న కల నేడు సాకారం అయినందుకు చాలా సంతోషంగా ఉందని కళ్యాణి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement