Wednesday, May 15, 2024

స్కూల్ నుంచి ఇంటికొచ్చిన బాలిక‌.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య

కుత్భుల్లాపూర్ క్రైమ్ (ప్రభ న్యూస్) : ఓ విద్యార్థిని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైద‌రాబాద్‌లోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావారి జిల్లాకు చెందిన వి.ఆంజనేయులు 15 సంవత్సరాలక్రితం హైద‌రాబాద్‌కు వచ్చి కుత్భుల్లాపూర్ రాజీవ్ గాంధీ నగర్ లో ఉంటూ వెల్డింగ్ వ‌ర్క్ చేస్తున్నాడు. అత‌నికి ఇద్దరు కుమార్తెలు తరంగిని (13), తుళ్లిక(10) స్థానికంగా ఉండే సిరి ఫ్యూచర్‌ కిడ్స్ స్కూల్ లో చదువుతున్నారు. రోజులాగే నిన్న ఉదయం పిల్ల‌ల‌ను స్కూల్‌కు పంపి ఆ తరువాత భార్యభర్తలు ప‌నికి వెళ్లారు. అయితే చిన్నఅమ్మాయి స్కూల్ అవ్వగానే మధ్యాహ్నం ఇంటికి వచ్చి పక్కనే ఉన్న మేనమామ ఇంటికి ఆడుకునేందుకు వెళ్లింది.

పెద్ద అమ్మాయి సాయంత్రం స్కూల్ అవ్వగానే 4 గంటలకు ఇంటికి వచ్చింది. ఆదుకోవడానికి వెళ్లిన చిన్న అమ్మాయి 4.30 గంటలకు వచ్చి తలుపుకొట్టగా ఎంతకు తీయకపోవడంతో స‌హాయం కోసం పక్కింటి వారిని పిలిచింది. ఎంత‌కూ డోర్ తీయకపోవడంతో బద్ద‌లుకొట్టి తీయగా సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. వెంట‌నే సూరారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఆసుపత్రికి వచ్చారు. అనంతరం జీడిమెట్ల పోలీస్ లకు ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు సిఐ కె.బాలరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement